Home » Samajwadi Party
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
పుణెలోని చారిత్రక శనివార్ వాడలో కొందరు మహిళలు నమాజ్ చేయడం వివాదం కావడంపై ఆయన మాట్లాడుతూ, అది ప్రార్థనా స్థలం కాదని, నమాజ్ సమయంలో కొందరు ప్రార్థనలు చేశారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఎందుకు థాంక్స్ చెప్పారు, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఫోటోలో అంబేడ్కర్ సగం తల, భుజాలు కనిపిస్తుండగా, దానిని కలుపుతూ తక్కిన సగం ఫోటోలో ఇదే తరహా అఖిలేష్ కటౌట్ ఉంది. దీంతో అఖిలేష్ యాదవ్పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
రాణా సంగాపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ మధ్యప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కర్ణిసేన సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీ ముఖానికి నల్లరంగు పూసి, చెప్పులతో కొట్టిన వ్యక్తికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని కూడా కర్ణిసేన రాష్ట్ర విభాగం ప్రకటించింది.
ఛత్రపతి శివాజీ మహరాజ్, సంభాజీ మహరాజ్ గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ తాను ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వాటిని వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానని అబూ అజ్మీ తెలిపారు.
సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న అబు అజ్మి తాజాగా ఔరంగజేబ్ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని కితాబిచ్చారు.
గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన దళిత మహిళ ఆ గ్రామానికి 500 మీటర్ల దూరంలోని ఒక కాలువలో మృతదేహంగా శనివారం ఉదయం కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై పలు చోట్ల లోతైన గాయాలు, ఫ్రాక్చర్లు ఉన్నాయని, కళ్లు తీసేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుసగా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఆప్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.
సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్లా వ్యవహరిస్తోందని ఆదిత్య థాకరే తప్పు పట్టారు.