Home » Nara Bhuvaneswari
కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి కట్టుమిషన్లు, తోపుడు బండ్లు, వినికిడి మిషన్లను అందజేశారు.
‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
‘పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్ ఆశయం. కూడు.. గూడు.. గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడా పథకాలు దేశమంతా అమలవుతున్నాయి.
‘చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తుకు పరిశ్రమలు దోహదపడతాయి. అందుకు అడ్డుపడకండి. స్వర్ణ కుప్పం సాకారానికి సహకరించండి’ అని కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఓ జాబ్మేళా కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత కష్టాన్ని నమ్ముకుని, స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు..
ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవలకు మారు పేరు. ఈ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు ఆమె బృందానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.