Home » Mayor Vijayalaxmi
ఒక్క వాన.. నగరంలో వరద నీటి ప్రవాహ వ్యవస్థ డొల్లతనమే కాదు.. ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్నీ బహిర్గతం చేసింది. కుంభవృష్టితో మహానగర పౌరులు అవస్థలు పడుతున్నా.. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్ జామ్తో తిప్పలు పడినా పట్టించుకున్న నాథుడు లేడు. అక్కడక్కడా మినహా అత్యవసర బృందాలు కనిపించలేదు.
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
GHMC: తెలంగాణలో జీహెచ్ఎంసీలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈనెల 11వ తేదీ తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేట్లర్లు కూడా అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు.
పంజాగుట్ట ఎన్ఎఫ్సీ జంక్షన్(Panjagutta NFC Junction) వద్ద అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(City Mayor Gadwal Vijayalakshmi) స్వల్ప ప్రమాదానికి గురయ్యారు.
GHMC Council Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం ప్రారంభంకానుంది. బీజేపీ, బీఆర్ఎస్ కార్పేరేటర్లు మేయర్ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. కమలం పార్టీ నేతలు వినూత్న రీతిలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా కార్పొరేటర్లకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, మరో ఇద్దరు కార్పొరేటర్లు కలిశారు.
త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తాను తిరిగి కార్పొరేటర్గా పోటీ చేయడం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) స్పష్టం చేశారు. ‘మేయర్గా, నగర ప్రథమ పౌరురాలిగా ఎంతో విజయవంతంగా పని చేశాననే సంతృప్తితో ఉన్నాను.
Mayor Gadwal Vijayalakshmi: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు తన గురించి తెలుసునని చెప్పారు. అక్రమంగా ఆస్తి సంపాదించాల్సిన అవసరం, ఖర్మా తనకు లేదని అన్నారు.
పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు.
హైదరాబాద్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కల్తీ ఆహారాన్ని గుర్తించారు. కుళ్లిన మాసం, అపరిశుభ్ర వాతావరణం కలిగిన వంట గదుల నిర్వహణ విషయంలో ఆమె యాజమాన్యంపై మండిపడ్డారు.