Home » Kanipakam
పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కాణిపాక క్షేత్రానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. దాంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు.
కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో గురువారం రాత్రి వినాయకస్వామి కల్పవృక్ష వాహనంలో దర్శనమిచ్చారు.
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు.
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
తిరుమల తరహాలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఒక్క రోజు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం శ్రీకారం చుట్టారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మాస్టర్ ప్లాన్ను అంచెలంచెలుగా అమలు చేస్తామని దేవదాయ శాఖ సీఈ శేఖర్ తెలిపారు.