Home » Jammalamadugu
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గండికోటను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 78 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు తెలిపారు. గండికోట ప్రాంతాన్ని గ్రాండ్ కాన్యన్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, శ్రీకృష్ణదేవరాయల వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Crime News: కడప జిల్లా జమ్మలమడుగులోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.
జమ్మలమడుగులోని ఓ క్లబ్లో పగలు రాత్రి తేడా లేకుండా అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లబ్ మూసివేశారు.
Republic Club: జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ను పోలీసులు మూ సి వేశారు. ఎంపీ ఫిర్యాదుతోపాటు మీడిాయాలో వరుస కథనాలు నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదీకాక.. ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు నిర్విరామంగా సదరు క్లబ్లో పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంతో అరుదైన, అపురూపమైన ఆదిమానవుడు రేఖా చిత్రాలు చింతకుంట కొండలో కనువిందు చేస్తున్నాయి. 25 వేల ఏళ్ల కిందట ఇక్కడ మా నవులు ఆవాసం ఏర్పరచుకున్నారని, జీవించా రని, కొండపై చిత్రించిన రేఖా చిత్రాలు ఆధార భూతమై నిలుస్తున్నాయి. ఇక్కడి వాతావర ణం, నీరు, ఆహారం పుష్కలంగా ఉండడంతో ఆదిమానవుడు ఆవాసానికి అనువైన ప్రదేశం గా ఎంచుకుని నివసించి ఉంటారని దాదాపు 200 రేఖాచిత్రాలను తిలకించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు.
జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎంపీ అవినాశరెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్లో పలువురు వైసీపీ నేతలు సమస్యలపై ఎంపీని నిలదీశారు.
మైలవరం డాడీహోంలో జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాస్, స్థానిక సిబ్బందితో 6వ తేదీ వెళ్లి పరిశీలించినట్లు సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది.
స్థానిక రైల్వేస్టేషన్ వద్ద నాగలకట్ట వెళ్లే దారిలో 27వ తేదీ సాయంత్రం గంజాయి నిందితులను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప తెలిపారు.
అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!..
జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను, కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. నిజమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.