Home » INDIA Alliance
లెబనాన్లో ‘బ్లూ హెల్మెట్స్’పై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాంతి పరిరక్షకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసింది. లెబనాన్ మిషన్లో కూడా భారత సైనికులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో లెక్కకు మిక్కిలిగా ఓటర్లను తొలగిస్తున్నారని, అధికార పక్షానికి అనూకూలంగా వ్యవహారిస్తూ, పారదర్శకతను పాతరేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై విరుచుకుపడుతున్న విపక్షాలు తాజాగా ఆయనపై అభిశంసన అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్గాంధీ తప్పుకోవాలని, ప్రాంతీయ నేతలకు అప్పగించాలని సూచించారు.
భారత్తో కొత్త అజెండా అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని కాజా కల్లాస్ ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్లో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత అవసరమైనదని ఆమె చెప్పారు.
చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసంతృప్తుల ఫలితం.. దీనికి తోడు ఇరాన్పై అమెరికా, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్ అగ్నిగుండంలా మారిపోతోంది. ఇరాన్ ప్రజలు ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్ను ఇండియా కూటమి కన్వీనర్గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు.
భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..