Home » Ganga
Ganga River: విశాల్ అనే వ్యక్తి శుక్రవారం హరిద్వార్లోని పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం చేయడానికి వెళ్లాడు. గంగలో దిగి ఈత కొడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
Gangamma Jatara: చిత్తూరు నగరంలోని బజారువీధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు, హేమంత్కుమార్ వెల్లడించారు. మంగళవారం వేకువ జాము నాలుగు గంటలకు ధర్మకర్త సీకేబాబు దంపతులు అమ్మవారికి తొలిపూజ చేసి, అంబలి నైవేద్యం సమర్పించారు.
గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.
ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది.భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు.
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.
మీరు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి కొందరు త్రివేణి సంగమం ఒడ్డున చేస్తున్న పనులు చూస్తే ఎవరైనా ఛీ ఛీ అనక మానరు. అమృత స్నానాలు చేసే చోట కొందరు భక్తులు చేస్తున్న అసహ్యకరమైన పనులు ఇవి..
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్కు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు వచ్చి గంగాదేవి, శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించారు.
మహాకుంభోత్సవం పాల్గొనడం భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశం భావిస్తున్నట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, పలువురుపార్టీ నేతలు మహాకుంభ్లో పాల్గొన్నారు.