Home » Dwaraka Tirumala
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
Dwaraka Tirumala: చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు.
Ganesh Sharma: కంచికామకోటి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సత్యవెంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ద్వారకా తిరుమలలో రుగ్వేదం అభ్యసించారు. వేసవి సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమాన ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను అదే సమయంలో తిరుపతి వచ్చిన కంచి కామ కోటి పీఠం శంకరాచార్య స్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది.
ఎటు పోతోంది సమాజం.. మన ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉంటారన్న సోయి లేకుండా పోతోంది కొందరు మగాళ్లలో. మనమూ ఒక అమ్మకు పుట్టినోళ్లమనే రెస్పెక్ట్ లేకుండా పోతోంది.
ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్తో షూట్ చేశాడు.
జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.
చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 వ రోజు గురువారం చిన వెంకన్న మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.