Home » Dharmendra Pradhan
ఖుష్బూ ఇటీవల 10వ తరగతిలో 500 మార్కులకు 399 మార్కులు సాధించింది. 400 మార్కుల అంచనాలకు ఒక్క మార్కు తేడా రావడంతో ఆమెను బలవంతంగా సైన్స్ కోర్సుకు బదులు ఆర్ట్స్లో చేర్పించారు. దాంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.
ధర్మేంద్ర ప్రధాన్పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్కు నిధులను ఎన్ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ 'అహంకార చక్రవర్తి' అని, తమిళనాడు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదని, ఆయన ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలని ఎంకే స్టాలిన్ సూచించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.
బడ్జెట్ సమావేశాల సెకెండ్ సెషన్ సోమవారంనాడు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడటంతో పార్లమెంటులో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. డీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను ..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.
రాష్ట్రంలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నడిరోడ్డుపై అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నీట్-పీజీ పరీక్షల(NEET - PG Exams) కొత్త షెడ్యూల్ను మరో రెండు రోజుల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) శనివారం వెల్లడించారు.
దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల నీట్, యూజీసీ-నెట్లలో(NEET UG 2024) అవకతవకలు జరిగాయన్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను శనివారం ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షను కూడా రద్దు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిపోయింది. దేశవ్యాప్తంగా మంగళవారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగ్గా..సోమవారమే ప్రశ్నపత్రాలు డార్క్వెబ్లో అందుబాటులోకి వచ్చాయి.