Home » Charminar
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
చార్మినార్ ఎక్స్ప్రెస్ సహా మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్ట సిద్దిక్నగర్ రోడ్డు నెంబర్-5కు చెందిన ఫెరోజ్ ఖాన్, సాయిదున్నిసా భార్యాభర్తలు.
Fire Accident In Charminar: ఉదయం 6.16 గంటలకు చార్మినార్, గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే మొఘల్పురా వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు.
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్బజార్ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.
Miss World 2025: మిస్ వరల్డ్-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్-2025 హెరిటేజ్ వాక్, చౌమల్లా ప్యాలెస్లో వెల్కమ్ డిన్నర్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వరుసగా ఏర్పడుతున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సురక్షితమనేది తొలస్తున్న ప్రశ్న. భూకంపాలకు దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్. భూకంప తీవ్రత రెండు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Telangana Tourism Hyderabad Tour : హైదరాబాద్ సిటీలో లెక్కలేనన్ని చారిత్రక, ప్రసిద్ధి పొందిన ప్రాంతాలున్నాయి. వీటన్నింటిని ఒక్కసారైనా చూడాలని మీరూ కోరుకుంటున్నారా.. వీకెండ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి సిటీ మొత్తం చూసేయాలని ఆశగా ఉందా.. అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం తెచ్చిన ఈ ప్యాకేజీతో మీరు ఒక్క రోజులోనే హైదరాబాద్లోని అన్ని స్పెషల్ ప్లేసెస్ చూడవచ్చు. అదీ కేవలం రూ.380లు ఖర్చుతోనే.. ఎలాగంటే..
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.