Home » Bhumana Karunakar Reddy
టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
TTD Goshala Controversy: ఎస్వీ గోశాలలో జరిగింది అంతా ఒక కామెడీ షో అంటూ భూమన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదన్నారు. పది నెలల కాలంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని.. హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని, కార్యకర్తలతో కాకుండా గన్ మెన్లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. అయినా ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.
TTD Board chairman: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా భూమనకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాటలో భూమనతోపాటు హరినాథ్ రెడ్డి ప్రమేయం ఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Bhanu prakash Vs Bhumana: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు.
తొక్కిసలాట ఘటనకు టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) ఆరోపించారు.
Andhrapradesh: సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయని భూమన అన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు.
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.