Home » Apps
సెల్ఫోన్ చోరీ చేసి ఫోన్ పే ద్వారా నగదును బదిలీ చేసుకున్న విషయం హైదరాబాద్ నగర శివారులో వెలుగుచూసింది. రాధాకృష్ణారావు అనే మాజీ సర్పంచ్ సెల్ఫోన్ చోరీకి గురైంది. అయితే.. అందులో ఉన్న ఫోన్ పే యాప్ ద్వారా రూ. 1.92 లక్షల నగదును కాజేశారు. కాగా.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.
లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఒకప్పుడు డబ్బులకు కటకటలాడేవారు జనం.. ఇప్పుడు సేవలు పొందడానికి ‘ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తాం’ అంటున్నారు. కాలు కదపకుండా ఇంటికే తెప్పించేసుకుంటున్నారన్నీ!. అవి వైద్యసేవలు కావొచ్చు.. పెంపుడు జంతువుల సంరక్షణ కావొచ్చు.. సెలూన్ సేవలూ అవ్వొచ్చు.. ఏదైనా సరే! ఒక ‘యాప్’ సాయంతో ఇంటి ముంగిటకొస్తున్న రకరకాల సర్వీసుల ధోరణి బాగా విస్తరిస్తోంది..
దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించేందుకు కొత్త బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది.
తన మాటలతో ముగ్గులోకి దింపి.. వలపు వల విసిరి కొందరు యువతులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నడరంలో ఎక్కువయ్యాయి. ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే అటు ఆర్థికంగా, ఇటు శారీరకంగా మోసపోతున్నారు.
మీరు క్రిప్టో యాప్లను వినియోగిస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే గూగుల్ తాజాగా 17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్లను తొలగించింది. ఈ యాప్స్ వినియోగదారుల డేటా భద్రత సహా అనేక విషయాల్లో ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
అసభ్యకరమైన కంటెంట్లను ప్రమోట్ చేయడం వల్ల భారత ప్రభుత్వం 18 ఓటీటీ యాప్లను నిషేధించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ ముర్గాన్ ఇటివల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎయిర్పోర్టులో ప్రయాణికులను టార్గెట్ చేసి ‘లాంజ్ యాప్’ ద్వారా డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఎయిర్పోర్ట్(Airport)లో వినియోగించే లాంజ్ యాప్లో సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ప్రవేశపెట్టారు. తద్వారా సేకరించిన సమాచారంతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు గత వైసీపీ ప్రభుత్వంలో బోధనే కాకుండా బోధనేతర పనులే ఎక్కువగా నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలపై రోజూ సంబంధిత యాప్లలో ఫొటోలు తీసి, ఆప్లోడ్ చేయాల్సి ఉండేది. దీని ఉపా ధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనే తర పనుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలు స్తోంది.
నేటి డిజిటల్ యుగంలో వంట నుంచి షాపింగ్ వరకు స్మార్ట్ఫోన్లలో(smart phone) అనేక యాప్లను(apps) ఉపయోగిస్తాము. అయితే 53 యాప్లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ క్రమంలో వినియోగదారులు ఆయా యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.