Home » AP DGP
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం విజయవాడలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ లొంగిపోవాలని కేంద్రం ఆదేశించిందని, ఈ రోజు(సోమవారం)తో ఏపీలో నక్సలిజం ఎండ్కి వచ్చిందని డీజీపీ అన్నారు.
సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఏపీ పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. పోలీసులు ఇప్పటికే ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్లో ముందుంటారని చెప్పారు. ఈ టోర్నీతో పోలీసుల ప్రైడ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
2025 సంవత్సరానికి గాను వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారన్నారని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు.
ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.
మావోయిస్టులు లేని ఏపీని చేయడమే లక్ష్యమని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్కౌంటర్లో మావోల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను డీజీపీ పరిశీలించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.
ఎరువుల లభ్యత, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆరా తీశారు.
రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.