Home » Abhishek Banerjee
పాకిస్థాన్కు రెండు వారాలు వారికి సమయం ఇచ్చినప్పటికీ ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరులపై ఒక్క చర్య కూడా తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ చెప్పారు. పైగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పాల్గొనడాన్ని అంతా చూశామని అన్నారు.
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.
ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్నలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సమీప బంధువు అభిషేక్ బెనర్జీ కి సుప్రీంకోర్టులో సోమవారం షాక్ తగిలింది. టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ఆపడానికి కలకత్తా హైకోర్టు (Calcutta High Court) తిరస్కరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై ఆయన చేసిన అపీలును తోసిపుచ్చింది.
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిర నరుల బెనర్జీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న రుజిరను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వాదం అనంతరం ఆమె విమానాశ్రయం విడిచిపెట్టి వెళ్లిపోయారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పశ్చిమబెంగాల్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. తాను బటన్ నొక్కితే నలుగురు కాంగ్రెస్ ఎంపీలు టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్ స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ను సీబీఐ శనివారం ప్రశ్నించింది....
కోల్కతా: పశ్చిమబెంగాల్లో స్కూలు ఉద్యోగాల కుంభకోణం లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమన్లు పంపింది. శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకాలని ఆదేశించింది.
పశ్చిమబెంగాల్కు నిధుల బకాయిలు చెల్లించడం లేదంటూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న మమతా బెనర్జీ సారథ్యంలోని..