ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి.
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది.
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్స్ను అడ్డుకునే ఇంటర్సెప్టర్ల కోసం గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్లోకి ప్రవేశిస్తున్నారు.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి మరో దేశం కూడా చేరినట్లు కనిపిస్తోంది.
పశ్చిమాసియాలోని పలు అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు జరగడంతో.. ఆ సైనికులకు గల్ఫ్లోని హోటళ్లు ఆశ్రయం కల్పిస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్ల యజమానులకు ఈ హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది.