YV Subba Reddy: తిరుపతికి రాలేను..హైదరాబాద్ లోనే విచారించండి..!

ABN, Publish Date - Nov 16 , 2025 | 09:50 AM

మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈ నెల 20న సిట్‌ విచారించనుంది. విచారణకు తిరుపతికి రావాలని దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే..

తిరుపతి: టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దేవస్థానం మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని ఈ నెల 20న సిట్‌ విచారించనుంది. విచారణకు తిరుపతికి రావాలని దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, తన ఆరోగ్యం సహకరించనందున తాను తిరుపతికి రాలేనని సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 20న సిట్‌ అధికారులు హైదరాబాద్‌ వెళ్లి అక్కడే ఆయనను విచారించనున్నట్టు సమాచారం.

Updated at - Nov 16 , 2025 | 09:50 AM