Share News

ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం అడిగారు

ABN , Publish Date - May 06 , 2025 | 05:59 AM

ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తమకు అదనంగా రూ. లక్ష కట్నం ఇవ్వాలని భర్త, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలింత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం అడిగారు

  • అత్తింటి వేధింపులు తాళలేక బాలింత ఆత్మహత్య

  • భూపాలపల్లి జిల్లా ముచినిపర్తి గ్రామంలో ఘటన

చిట్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తమకు అదనంగా రూ. లక్ష కట్నం ఇవ్వాలని భర్త, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలింత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచినిపర్తి గ్రామంలో జరిగింది. ముచినిపర్తి గ్రామానికి చెందిన కత్తికొండ శంకర్‌, లక్ష్మి దంపతుల రెండో కుమార్తె నిరూష (26)ను వరంగల్‌ దేశాయిపేటకు చెందిన మునుగొండ సాంబయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు ప్రశాంత్‌కు ఇచ్చి గత ఏడాది వివాహం జరిపించారు. కాగా, ఇరవై రోజుల క్రితం నిరూషకు ఆడపిల్ల పుట్టింది.


ఈ క్రమంలో నిరూష ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తమకు అదనంగా రూ.లక్ష కట్నం ఇవ్వాలని ఆమె తల్లిదండ్రులపై ప్రశాంత్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. ఆదివారం భర్తతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి నిరూష ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చిట్యాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిరూష సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రశాంత్‌తో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:59 AM