Share News

Maoists arrested: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

ABN , Publish Date - May 30 , 2025 | 08:37 AM

Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.

Maoists arrested: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు
Two Maoists Arrested

ములుగు: బంధువు ఇంట్లో తలదాచుకునేందుకు వచ్చిన ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు (Two Maoists Arrested). వారిలో ఒకరు మహిళా మావోయిస్టు.. కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్ (Encounter) నుంచి తప్పించుకుని ఏటూరునాగారం మండలం, చిన్నబోయినపల్లి పంచాయతీ రాయిబంధం, గొత్తికోయగూడెంలో తలదాచుకున్నారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు ఏటూరునాగారం పోలీసులకు (Aturunagaram Police) సంఘటన ప్రదేశానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి పరారయ్యాడు (Shelter Escape). పోలీసులకు దొరికితే ఏం చేస్తారోనన్న భయంతో ఆ వ్యక్తి ఇంట్లో నుంచి పారిపోయినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు.


మావోయిస్టు చిట్టీకి బుల్లెట్ గాయం.. రహస్యంగా చికిత్స..

అయితే పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు. దీంతో పోలీసులు అతనికి రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ దళం వివరాలు తెలుసుకునేందుకే చిట్టీకి రహస్యంగా చికిత్స చేయిస్తున్నారు. కాగా ఇద్దరు మావోయిస్టుల పట్టివేతపై ములుగు జిల్లా పోలీసులు నోరుమెదపడంలేదు.

Also Read: సీఐఐ వార్షిక సదస్సుకు సీఎం చంద్రబాబు


జూనియర్‌ హిద్మా అరెస్టు...

మరోవైపు ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్‌ హిద్మాను అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒడిశాలోని కోరాపుట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏవోబీలోని కోరాపుట్‌ జిల్లా బోయిపర్‌గూడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేటగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఏఎస్పీ పార్థకశ్యప్‌ నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. కొండపై క్యాంప్‌ నిర్వహిస్తున్న మావోయిస్టులు కనిపించారు.

దీంతో పోలీసులు ఆ కొండను చుట్టుముట్టారు. ఇది గమనించిన మావోయిస్టులు కొండపై నుంచి పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనా స్థలంలో పోలీసులు గాలిస్తుండగా.. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు కుంజమ్‌ హిద్మా అలియాస్‌ జూనియర్‌ హిద్మా అలియాస్‌ మోహన్‌గా గుర్తించారు. హిద్మా నుంచి ఏకే 47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 ఎలక్ర్టిక్‌, నాన్‌ ఎలక్ర్టిక్‌ డిటొనేటర్లు, రేడియో, కత్తులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో మావోయిస్టు పరారయ్యాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై కీలక నిర్ణయం

పాక్‌ ర్యాలీలో ‘పహల్గాం’ సూత్రధారి

For More AP News and Telugu News

Updated Date - May 30 , 2025 | 08:37 AM