Share News

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

ABN , Publish Date - Jun 02 , 2025 | 07:28 AM

Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు
Telangana Formation Day

Warangal: తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం (Government) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో జరగనున్న ఆవిర్భావ వేడుకల్లో పలువురు మంత్రులు (Ministers) పాల్గొననున్నారు. హనుమకొండలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha), వరంగల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy), ములుగులో మంత్రి సీతక్క (Seethakka) ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అలాగే మహబూబాబాద్‌లో విప్ రాంచంద్రనాయక్ (Ramchandra Naik), భూపాలపల్లిలో అటవీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పొదెం వీరయ్య (Podem Veerayya), జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఇందు కోసం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

Also Read: ఉపాధ్యాయుడు మందలించడం.. ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు


పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం

మరోవైపు జనగామ జిల్లా, పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. పాత మోడల్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తెలంగాణ తల్లి విగ్రహ పంచాయితీ కొనసాగుతోంది. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ విషయంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం రాజుకుంది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపంలోని విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామిక హబ్‌గా ఏపీ

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

For More AP News and Telugu News

Updated Date - Jun 02 , 2025 | 07:28 AM