Share News

Vemulawada: కోడె గోస చూడు... రాజన్నా...

ABN , Publish Date - May 31 , 2025 | 12:31 PM

కోడె కడితే కోటి వరాలనిచ్చే దేవుడిగా వెలుగొందు తున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి ఎంతో విశ్వాసంతో భక్తులు అందజేస్తున్న నిజకోడెల పరి స్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గోశాలపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ, అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.

Vemulawada: కోడె గోస చూడు... రాజన్నా...

- ఒకే రోజు 8 కోడెల మృత్యువాత

- కొనఊపిరితో నాలుగు, అనారోగ్యంతో మరో పది..

- గోశాల సామర్థ్యానికి మించి కోడెల సంరక్షణ

- కొరవడిని ఆలయ అధికారుల పర్యవేక్షణ

వేములవాడ(రాజన్న సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్‌ గోశాలలో గురువారం అర్ధరాత్రి ఒకేరోజు ఎనిమిది కోడెలు మృత్యువాత పడ్డాయి. దీంతో గుట్టుచప్పుడు కాకుండా గోశాల సిబ్బంది ట్రాక్టర్‌లో వాటిని తరలించి మూలవాగులో ఖననం చేయడం పట్టణంలో తీవ్ర చర్చనీయంశంగా మారింది. అంతే కాకుండా నాలుగు కోడెలు కొనఊపిరితో, మరో 10 కోడెలు అనారోగ్యంతో బక్కచిక్కిపోయి దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న తీరు కలిచివేస్తోంది. రాజరాజే శ్వర స్వామివారికి ప్రతినెలా 100 నుంచి 150 కోడెల ను భక్తులు ఎంతో విశ్వాసంతో అందజేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోశాలలో ప్రస్తుతం 1500 నుంచి 2 వేల వరకు కోడెలు, ఆవులు ఉన్నాయి.


సామర్థ్యానికి మించి కోడెలు..

రాజన్న ఆలయ తిప్పాపూర్‌ గోశాలలో కోడెల సం రక్షణ కోసం 11షెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో షెడ్డులో సుమారుగా 50 నుంచి 60 కోడెలు నివసించేందుకు ఏర్పాటు చేశారు. 11 షెడ్లలో 600 వరకు కోడెలు ఉండాల్సి ఉండగా, 2 వేల వరకు కోడెలు ఉన్నట్లు తెలుస్తోంది. గోశాలలో కోడెల సం ఖ్యను సంబంధిత అధికారులు రికార్డులపరంగా చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గోశాలకు వచ్చిన ప్రతి ఆవుకు, కోడెకు తప్పనిసరిగా ట్యాగ్‌ వేయాల్సి ఉండగా సగం వరకు కోడెల చెవు లకు ట్యాగ్‌లు లేకపోవడంతో పలు ఆరోపణలు గప్పు మంటున్నాయి. గోశాలలోకి కోడెలు వచ్చే సమయం లోనే ట్యాగ్‌ వేయాల్సి ఉండగా గోశాలలో కొంత కాలంగా ఉంటున్న ట్యాగ్‌లు వేయకపోవడంతో పక్క దారి పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.


zzzz.jpg

రాజన్న గోశాలపై సంబంధిత అధికారులు పర్య వేక్షణ లేకపోవడంతోనే నిర్వాహకులు కోడెల సం రక్షణపై పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే గత సంవత్సరం కోడెల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం కోడెలను రైతులకు అందించాలని నిర్ణ యించి అర్హులైన వారికి అందించారు. ప్రస్తుతం కోడెల పంపిణీ నిలిచిపోవడంతో కోడెల సంఖ్య అ మాంతం పెరిగిపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కోడెలను రైతులకు పంపిణీ చేయాలని కోరుతున్నారు.


బురదతో నిండిపోయిన గోశాల..

రాజన్న ఆలయ గోశాలలో కోడెల సంరక్షణ కోసం షెడ్డులను ఏర్పాటు చేశారు. గతంలో పాత షెడ్డులు 10 వరకు ఉండగా, అందులో ఒక షెడ్డులో కోడెలకు అందించే వరిగడ్డిని నిల్వచేయగా 9షెడ్లలో కోడెలను సంరక్షిస్తున్నారు. నూతనంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మరో మూడు కొత్త షెడ్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో మొత్తంగా 11 షెడ్లు కోడెలు నివసించేందుకు అనువుగా ఉన్నాయి.

ఒక్కో షెడ్డులో 50 నుంచి 60 కోడెలు ఉండేలా ఉండేందుకు సౌకర్యం ఉంటుంది. అయితే 11 షెడ్ల లో 600 కోడెలు మాత్రమే ఉండే అవకాశం ఉండగా ప్రస్తుతం గోశాలలో ఉండే కోడెల సరైన లెక్కను అధికారులు చెప్పడం లేదు. సుమారుగా 1500 నుంచి 2 వేల వరకు కోడెలు గోశాలలో ఉన్నట్లు స్థానిక సిబ్బంది అంచనా వేస్తున్నా రు. గోశాల సామర్థ్యానికి మించి కోడెలు గోశాలలో ఉండటంతో ఆరు బయట చలువ పందిళ్లు వేసి సంరక్షిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చలువ పందిళ్ల కింద నేల బురదమయంగా మారింది. కోడెల కాళ్లు బురదలో దిగబడిపోతున్నా పట్టించు కునే వారు కరువయ్యారు.


పర్యవేక్షణ కరువు..

రాజన్న ఆలయానికి వచ్చే కోడల సంరక్షణ కోసం పట్టణంలోని కట్టకింద ఒక గోశాల,తిప్పాపూర్‌లో ఒక గోశాలను ఏర్పాటు చేశారు. అయితే కోడెల సంరక్ష ణపై పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. గోశాల లో 2 వేల వరకు కోడెలు ఉన్నప్పటికి అఽధికారులు గోశాల వైపు కన్నెత్తి చూడటం లేదని, నామమా త్రంగా వచ్చి చూసి వెళుతారని చెబుతున్నారు.

భక్తులు వదిలేసి వెళ్లిన కోడెలు మృత్యువాత..

వేములవాడ రాజన్నకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిజ కోడెలను తీసుకువచ్చి మొక్కులు చెల్లిం చుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్న కోడెలు, జెర్సీ, పాలు మరవని కోడెలను భక్తులు తీసుకు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అలాంటి వాటిని గోశాలలో తీసుకోవడం లేదని దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు వదిలేసి వెళుతున్నారని, తప్పనిసరి పరిస్థితిలో కోడెలను గోశాలకు తీసుక వస్తున్నామని, అలాంటి కోడెలు మృత్యువాత పడుతు న్నాయని చెబుతున్నారు. కోడెల సంరక్షణ కోసం వెటర్నరీ వైద్యులను సైతం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, 10 కోడెల వరకు అనారోగ్యంతో ఉన్నాయని, అందులో వైద్యుల చికిత్సతో కొన్ని కోలుకుంటున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 12:33 PM