True Up Petitions: 2 నెలల్లో ట్రూ-అప్ పిటిషన్లు వేయండి
ABN , Publish Date - May 06 , 2025 | 04:17 AM
గత మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కాలానికి రెండు నెలల్లో ‘ట్రూ-అప్’ పిటిషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర డిస్కమ్లకు టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్ర డిస్కమ్లకు టీజీఈఆర్సీ ఆదేశం
గత మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కాలానికి రెండు నెలల్లో ‘ట్రూ-అప్’ పిటిషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర డిస్కమ్లకు టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒక ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చార్జీల ఆదాయం, విద్యుత్ సంస్థల ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ఈఆర్సీ ముంగిట సంబంధిత రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు).. ట్రూ-అప్ లేదా ట్రూ-డౌన్ పిటిషన్లు వేయాలి.
ఆ పిటిషన్లపై ఈఆర్సీ ఆదేశాలకు అనుగుణంగా డిస్కమ్లు చార్జీల పెంపు ద్వారా ఖర్చులు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. తాజాగా డిస్కమ్లు పిటిషన్లు వేయడానికి టీజీఈఆర్సీ అనుమతి ఇవ్వడంతో మూడేళ్లకు కలిపి వినియోగదారులపై ఎంత భారం పడుతుందో తేలాల్సి ఉంది.