TGSRTC: హైదరాబాద్ - విజయవాడ బస్సుల్లో చార్జీలపై రాయితీ !
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:11 AM
హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది.

నేటి నుంచి అమలులోకి: టీజీఎస్ ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. టికెట్ చార్జీలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నామని బీహెచ్ఈఎల్ డిపో మేనేజన్ సుధా ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ రాయితీ అమలవుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
బస్సు - పాత బేసిక్ ధర - కొత్త బేసిక్ ధర - రాయితీ
గరుడ ప్లస్ - 635 - 444 - 191
ఈ గరుడ ప్లస్ - 592 - 438 - 154
రాజధాని ఏసీ - 533 - 448 - 85
లహరి ఏసీ స్లీపర్ - 815 - 685 - 130
సూపర్ లగ్జరీ - 440 - 352 - 88
లహరి నాన్ ఏసీ - 538 - 430 - 108
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News