Kaleshwaram Project: మరమ్మతులు చేయండి.. పెండింగ్ బిల్లులివ్వండి!
ABN , Publish Date - May 20 , 2025 | 04:11 AM
రానున్నది వానాకాలం.. వచ్చే 2 నెలల్లో గోదావరికి వరదలొస్తాయి. ఈ నేపథ్యంలో సాగునీటి సరఫరా కోసం గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన బ్యారేజీల పరిరక్షణపై సర్కారు దృష్టి సారించింది.

నీటి పారుదలశాఖ అధికారులు, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సంస్థల పరస్పర అభ్యర్థనలు
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): రానున్నది వానాకాలం.. వచ్చే 2 నెలల్లో గోదావరికి వరదలొస్తాయి. ఈ నేపథ్యంలో సాగునీటి సరఫరా కోసం గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన బ్యారేజీల పరిరక్షణపై సర్కారు దృష్టి సారించింది. అందులో భాగంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎ్సఎ) సిఫారసులకనుగుణంగా ఆయా బ్యారేజీల పరిరక్షణకు మరమ్మతులు చేపట్టాలని వాటి నిర్మాణ సంస్థలను సాగునీటి పారుదలశాఖ అధికారులు కోరారు.
ఇంతకు ముందు చేసిన పనుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని సోమవారం తమతో సమావేశమైన అధికారులను బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులు.. ఎల్ అండ్ టీ (మేడిగడ్డ), ఆఫ్కాన్స్ (అన్నారం), నవయుగ (సుందిళ్ల) కోరారు. గతేడాది వానాకాలానికి ముందు మేడిగడ్డ బ్యారేజీ రక్షణకు తాము చేపట్టిన పనుల బిల్లులు విడుదల కాలేదని ఎల్ అండ్ టీ ప్రతినిధులు, నీటి పారుదలశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉంటే, ఎన్డీఎ్సఏ నివేదికకనుగుణంగా బ్యారేజీల భద్రతపై పరీక్షలు, తదుపరి మరమ్మతు ప్రణాళికలు, పెండింగ్ బిల్లుల వివరాలతోపాటు ఆయా పరీక్షలకు అవసరమైన నిధులెంత అన్న విషయమై బుధవారానికల్లా నివేదికలు ఇవ్వాలని నిర్మాణ సంస్థలకు అధికారులు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News