Share News

Skill Development: ఇంజనీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రామ్‌’

ABN , Publish Date - May 09 , 2025 | 03:19 AM

యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేందుకు, వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Skill Development: ఇంజనీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రామ్‌’

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

  • జేఎన్‌టీయూ- టీసీఎస్‌ ఐయాన్‌ మధ్య ఒప్పందం

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేందుకు, వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ‘ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా జేఎన్‌టీయూ, టీసీఎస్‌ ఐయాన్‌ సంస్థ కలిసి ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని చెప్పారు. ఇందుకు సంబంధించి జేఎన్‌టీయూ-టీసీఎ్‌స ఐయాన్‌.. రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో గురువారం అవగాహన ఒప్పదం చేసుకున్నాయి.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీసీఎస్‌ ఐయాన్‌ సంస్థ తొలి దశలో ప్రతి ఐదు నెలలకు వంద మంది ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు శిక్షణను ఇచ్చి, ఉద్యోగాలకు సిద్ధం చేస్తుందన్నారు. ఆ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న 3వేల సంస్థలు శిక్షణ పొందిన వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత మంథనిలోని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి, టీసీఎస్‌ ఐయాన్‌ ప్రతినిధి స్మృతిముల్యే, టీసీఎస్‌ ఐయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:20 AM