TG ECET: టీజీఈసెట్లో 93.87% ఉత్తీర్ణత
ABN , Publish Date - May 26 , 2025 | 03:52 AM
ఇంజనీరింగ్ డిగ్రీలో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, వికారాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ డిగ్రీలో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉస్మానియా వర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీ ఆచార్య ఎం.కుమార్, టీజీఈసెట్ కన్వీనర్ ఆచార్య పి.చంద్రశేఖర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 18,928 మంది పరీక్షకు హాజరుకాగా 17,768 (93.87ు) మంది ఉత్తీర్ణులయినట్టు బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈసీఈలో 4,774 మంది, సీఎస్ఈలో 4,522 మంది, ట్రిపుల్ఈలో 3,719, సివిల్ 2389, మెకానికల్లో 1,813, మైనింగ్లో 232, కెమికల్ ఇంజనీరింగ్లో 85 మంది ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. కాగా టీజీఈసెట్-2025లో వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారు. కళాశాల విద్యార్థులు గొల్ల శ్రీశైలం రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు, గొల్ల స్వామి 62వ ర్యాంకు, పి.అక్షయ 95వ ర్యాంకు, డి.అక్షయ్రెడ్డి 103వ ర్యాంకు, ఎం.పృథ్వీరాజ్ 158వ ర్యాంకు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ కె.రవీందర్, లెక్చరర్లు అభినందించారు.
డీఈఈసెట్కు 77.5%హాజరు
డిప్లొమా ఇన్ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సులకు సంబంధించిన డీఈఈసెట్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 183 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 43,615 మంది దరఖాస్తు చేసుకోగా 33,821 (77.54ు) మంది హాజరైనట్టు కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. పరీక్షలకు తెలుగు మీడియం విద్యార్థులు 15,476, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం విద్యార్థులు 18,345 మంది హాజరయ్యారయ్యారని, పరీక్ష ఫలితాలను జూన్5లోపు ప్రకటిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం