Civil Services Exam: సివిల్స్లో వరంగల్
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:56 AM
ఎప్పటిలాగానే సివిల్స్ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. టాప్-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండగా..

ఇద్దరు ఓరుగల్లు బిడ్డలకు ఉత్తమ ర్యాంకులు
సాయి శివానికి 11, విజయసింహారెడ్డికి 46
1129 పోస్టులకుగాను 1009 మంది ఎంపిక
టాప్ 100 జాబితాలో ఏడుగురు తెలుగువారు
మొత్తం క్వాలిఫై అయినవారు.. 57 మంది
శ్రీకాకుళం జిల్లావాసి వెంకటేశ్కు 15వ ర్యాంకు
‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం కింద
సాయం పొందినవారిలో ఏడుగురికి ర్యాంకులు
సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు
తొలి ప్రయత్నంలోనే టాపర్గా యూపీ యువతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
ఎప్పటిలాగానే సివిల్స్ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. టాప్-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండగా.. వారిలో ఇద్దరు వరంగల్జిల్లా వాసులు! ఓరుగల్లు బిడ్డ ఇట్టబోయిన సాయిశివాని 11వ ర్యాంకుతో అదరగొట్టగా.. రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు సాధించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకుతో టాప్-20లో నిలిచారు. అభిషేక్ శర్మ (38), చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (62), సాయి చైతన్య జాదవ్ (68), చక్కా స్నేహిత్ (94), ఎన్.చేతనరెడ్డి (110), చెన్నంరెడ్డి శివగణేశ్ రెడ్డి (119), చల్లా పవన్ కల్యాణ్ (146), నెలటూరు శ్రీకాంత్ రెడ్డి (151), నెల్లూరు సాయితేజ (154), కొలిపాక శ్రీకృష్ణసాయి (190) తదితరులు మెరుగైన ర్యాంకులు సాధించారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన ‘సివిల్స్ 2024’ తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు చెందిన శక్తి దూబె తన తొలి ప్రయత్నంలోనే టాపర్గా నిలవగా.. హరియాణాలో జన్మించి గుజరాత్లో పెరిగిన హర్షిత గోయల్ రెండోస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో వరుసగా అర్చిత్ పరాగ్ (3), షా మార్గి చిరాగ్ (4), ఆకాశ్ గార్గ్ (5) నిలిచారు. ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాప్ 25 జాబితాలో నిలిచినవారిలో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 42,560 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాగా.. వారిలో 600 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వారిలో దాదాపు 100 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. 40 మందికిపైగా తుదిజాబితాలో చోటు సాధించారు. తెలంగాణకు చెందిన చాలా మంది అభ్యర్థులు రెండేళ్లుగా గ్రూప్-1 పరీక్షలకు హాజరవడానికి ఇష్టపడ్డారని.. అందుకే గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనవారి సంఖ్య ఒకింత తక్కువగా కనిపిస్తోందని సివిల్స్ కోచింగ్ సెంటర్ ‘బ్రెయిన్ ట్రీ’ డైరెక్టర్ గోపాలకృష్ణ చెప్పారు.
1129 పోస్టుల భర్తీకి..
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1129 పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమినరీ, సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకూ దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. 5,83,213 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. వీరిలో మెయిన్స్ రాత పరీక్షకు 14,627 మంది అర్హత సాధించగా, ఇంటర్వ్యూలకు 2,845 మంది ఎంపికయ్యారు. జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 నడుమ ఇంటర్వ్యూలు నిర్వహించి.. వారిలో1,009 మంది అభ్యర్థులను సివిల్స్కు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. వారిలో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 109, ఓబీసీ కేటగిరీ కింద 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది ఎంపికైనట్టు వివరించింది. 241 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ప్రొవిజనల్ జాబితాలో ఉంచి.. ఒకరి ఫలితాన్ని విత్హెల్డ్లో ఉంచినట్టు తెలిపింది. సివిల్స్ అభ్యర్థుల మార్కుల జాబితాను 15 రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరు ర్యాంకర్లు..
సివిల్స్ ఫలితాల్లో 200కు పైగా ర్యాంకు సాధించిన తెలుగువారిలో.. బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి (221), పూల ధనుష్ (232), పోతరాజు హరిప్రసాద్ (255), పి.లక్ష్మీప్రియ (297), ఎస్.సాయికిరణ్ (298), కె.శ్రీనివాస కీర్తిరెడ్డి (316), ఎం.ఉదయ్ కృష్ణారెడ్డి (350), ఎం.పవన్కుమార్ రెడ్డి (375), రాపర్తి ప్రీతి (451), పి.భార్గవ్ (455), సి.రాహుల్ (462), జె.భానుప్రకాశ్ (523), సి.భరత్ (567), గుబ్బల ఏఆర్వీ సూర్యతేజ (647), దోనేపూడి విజయ్బాబు (681), ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ (700), పి.ఇంద్రార్చిత (739) శనగవరపు సాయిభార్గవ (798), టి.సూర్యతేజ (799), వావిలపల్లి భార్గవ (830), గుగులోతు జీతేందర్నాయక్ (855), బి.మౌర్యతేజ (856) బి.వెంకట రామ్యజ్ఞ (863), వడ్డాది సాయిరోహన్ (892), కోకా ప్రియతం మనోహర్ (915), జి.ఆంజనేయులు (934), బానోతు శ్రీనికేశ్నాయక్ (938), జి.ప్రసాద్ (944), ఆర్.సుధాకర్ (949), చలవాది శ్రావణ సౌమ్య (951), ఆర్.సాయిమోహిని మానస (975) తదితరులున్నారు.
ఇదీ లెక్క
యూపీఎస్సీ ఈ పరీక్షలను 1129 పోస్టుల భర్తీకి నిర్వహించింది. అందులో ఏయే ఉద్యోగాల సంఖ్య ఎంతంటే..
ఐఏఎస్ 180
ఐఎ్ఫఎస్ 55
ఐపీఎస్ 147
గ్రూప్ ఏ 605
గ్రూప్ బి 142
ఇవి కూడా చదవండి
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News