Telangana: నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క
ABN , Publish Date - May 27 , 2025 | 02:58 PM
ఉపాధి అవకాశల కల్పన కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2న లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నామని మంత్రి సీతక్క తెలిపారు. లక్ష లోపు యునిట్లకు మొదటి దశలో ప్రొసిడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి సీతక్క శుభవార్త తెలిపారు. ఉపాధి అవకాశల కల్పన కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2న లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నామని వెల్లడించారు. రూ. లక్ష లోపు యునిట్లకు మొదటి దశలో ప్రొసిడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా రేవంత్ ప్రభుత్వం ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందించనున్నట్లు ప్రకటించారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూనే.. మరో వైపు స్వయం ఉపాది అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మొదటి విడతలో రూ. లక్ష లోపు యునిట్లకు ప్రొసిడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించిందని, దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. నిరుద్యోగుల పాలిట వరంగా రాజీవ్ యువ వికాసం నిలుస్తోందని, బడుగు బలహీన వర్గాలు, పేద యవత జీవితాల్లో రాజీవ్ యువ వికాసం వెలుగులు నింపనుందని వ్యాఖ్యానించారు.