Committee Report: ఉద్యోగుల సమస్యలపై ఉపసంఘానికి నివేదిక
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:34 AM
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది.

అధ్యయనం అనంతరం ఉద్యోగ సంఘాలతో భేటీ
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి లోకేశ్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ సభ్యులుగా ఉద్యోగుల సమస్యలు వినేందుకు త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు భేటీ అయి వారితో చర్చించింది. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై నివేదికను తయారుచేసి శనివారం ప్రజాభవన్లో మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేసింది. అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానుందని భట్టి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
1500 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం
3న ఆర్బీఐ నిర్వహించే వేలం ద్వారా అప్పు సేకరణ
హైదరాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1500 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈమేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శనివారం ఇండెంటు పెట్టింది. 19 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 20 ఏళ్ల కాల పరిమితితో రూ.700 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకోనుంది. జూన్ 3న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పును సేకరించనుంది. రాష్ట్రంతో కలిపి దేశంలోని 12 రాష్ట్రాలు రూ.29,400 కోట్ల అప్పుల కోసం ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News