Medigadda Barrage: బ్లాక్-7 బాధ్యత తప్పించుకోలేరు
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:08 AM
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్-7లో సమస్యకు ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది.

తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
ఇతర బ్లాక్లపై ప్రభావం పడకుండా చూడాలి
3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
ఎన్డీఎ్సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్-7లో సమస్యకు ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్డీఎ్సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్-7లో రాఫ్ట్, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.
బ్లాక్-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్ అండ్ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్డీఎ్సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్డీఎ్సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్ అండ్ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్ అండ్ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు, డిజైన్కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్డీఎ్సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.
లేఖలోని ముఖ్యాంశాలు
బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్ పైల్స్ దెబ్బతినడానికి, కటా్ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్ చేయడమే కారణం.
ఏడో బ్లాక్లోని 17, 20, 21 పిల్లర్ల కటా్ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
సిమెంట్, కాంక్రీట్లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News