Hyderabad: అసెంబ్లీ, మండలి ఒకే చోట
ABN , Publish Date - May 17 , 2025 | 03:21 AM
వచ్చే వర్షాకాలం సమావేశాల కల్లా అసెంబ్లీ కొత్త రూపు సంతరించుకోనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్ తరహాలోనే.. అంసెంబ్లీ, మండలి భవనాలను ఒకే దగ్గర నిర్వహించనున్నారు.

పార్లమెంటు తరహాలో ఏర్పాట్లు
పనులను పరిశీలించిన మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే వర్షాకాలం సమావేశాల కల్లా అసెంబ్లీ కొత్త రూపు సంతరించుకోనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్ తరహాలోనే.. అంసెంబ్లీ, మండలి భవనాలను ఒకే దగ్గర నిర్వహించనున్నారు. అసెంబ్లీ భవనంలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న హాలుతో పాటుగా గతంలో సమావేశాలు జరిగిన హాలు కూడా ఉంది.
ఆ హాలులో శాసనమండలి సమావేశాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనమండలిని శాసనసభ భవనంలోకి తరలించేందుకు పునరుద్ధర ణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News