Vikarabad: ఆదర్శంగా నిలుస్తోన్న ప్రభుత్వోపాధ్యాయుడు
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:25 AM
వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్ మండలం ఎంకతలలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ ఆయన విద్యాబోధన చేస్తున్న పాఠశాలలోనే వారి ఇద్దరు పిల్లలను చేర్పించి తోటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వారి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు
మోమిన్పేట్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్ మండలం ఎంకతలలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ ఆయన విద్యాబోధన చేస్తున్న పాఠశాలలోనే వారి ఇద్దరు పిల్లలను చేర్పించి తోటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువారం ఎంకతల ప్రభుత్వ పాఠశాలలో కూతురు అశ్వితను ఐదో తరగతిలో, కుమారుడు సాయి నిహాంత్ను రెండో తరగతిలో చేర్పించారు.
అంతకు ముందు కూడా ఆయన పనిచేసిన చంద్రయాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలోనే వారి పిల్లలను చదివించారు. ఈ సందర్భంగా ఎంఈవో మల్లేశం.. రమేశ్ను అభినందించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని రమేశ్ కోరారు.