Supreme Court: మూడు రోజుల్లో భారత్కు రావాలి
ABN , Publish Date - May 30 , 2025 | 03:42 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎ్సఐబీ) మాజీ చీఫ్(ఓఎస్డీ) ప్రభాకర్రావు మూడ్రోజుల్లో భారత్ రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు సహకరించాలి
కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి
ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
బలవంతపు చర్యలొద్దని సర్కారుకు
సూచన.. ఆగస్టు 5న తదుపరి విచారణ
న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎ్సఐబీ) మాజీ చీఫ్(ఓఎస్డీ) ప్రభాకర్రావు మూడ్రోజుల్లో భారత్ రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభాకర్రావుకు ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవొద్దని సర్కారుకు సూ చించిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను అలుసుగా తీసుకోవద్దని ప్రభాకర్రావును హెచ్చరిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024 మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు.. అప్పటికే క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో ఓ దశలో.. ‘‘నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే.. భారత్కు తిరిగి వస్తాను’’ అని ప్రభాకర్రావు హైకోరునాశ్రయించారు. ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించగా.. ఆ తీర్పును ఈ నెల 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్చంద్ర శర్మల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభాకర్రావు తరపు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ.. ‘‘ప్రభాకర్రావు పోలీసు శాఖలో 30 ఏళ్లకు పైగా సేవలందించారు. క్యాన్సర్ చికిత్సకు అమెరికాకెళ్లగానే కేసు నమోదైంది.
పాస్పోర్టు రద్దు చేశారు’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తొలుత దేశానికి వచ్చేలా చేసి, విచారణకు సహకరించకపోతే.. అప్పుడు చర్యలు తీసుకోవచ్చని గత విచారణలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. జస్టిస్ నాగరత్న కల్పించుకుంటూ.. ప్రభాకర్రావు భారత్కొచ్చారా? అని ప్రశ్నించారు. దానికి శేషాద్రినాయుడు స్పందిస్తూ.. పాస్పోర్టు రద్దుతో రాలేకపోతున్నారని, కోర్టు అనుమతిస్తే ఆయన దేశానికి వచ్చి, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘‘రాజకీయ కక్షసాధింపులో భాగంగా కొందరు నేతలను టార్గెట్గా చేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆధారాలను కోర్టు ముందు పెడతామని తెలిపారు. దీంతో.. జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో ఎంతమందికి ముందస్తు బెయిల్ వచ్చింది? ఎంత మందికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది??’’ అని ప్రశ్నించారు. ఒకరికి ముందస్తు బెయిల్, నలుగురికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని శేషాద్రినాయుడు బదులిచ్చారు. ఈ వాదనలతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విభేదించారు. ‘‘మిగతా నిందితులను, ప్రభాకర్రావును ఒకేలా చూడొద్దు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్రావుది కీలక పాత్ర. ఆయనే ప్రధాన నిందితుడు’’ అని ఽచెప్పారు. ముందే కేసు తీవ్రత గ్రహించి, భార్యతో కలిసి తిరుపతి నుంచి చెన్నైకి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లిపోయారని తెలిపారు. 2020లో రిటైరైన ప్రభాకర్రావు.. 2023 వరకు ఎస్ఐబీ చీఫ్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. మూడ్రోజుల టైం ఇస్తే.. ప్రభాకర్రావును భారత్కు తీసుకొస్తామని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ప్రభాకర్రావు భారత్కు వస్తే.. ఆయనను అరెస్టు చేస్తారా?’’ అని ప్రశ్నించగా.. అవునని తుషార్ మెహతా బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలను వినిపిస్తూ.. ప్రభాకర్రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొదంటూ అభ్యర్థించారు. దీనికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘‘మీరు పాస్పోర్టును రద్దు చేయించారు. అతను ఒక ప్రకటిత నేరస్థుడని చెబుతున్నారు. మరోవైపు.. దేశానికి తిరిగి రావడం లేదంటున్నారు. ముందు ఆయన్ని రానివ్వండి. దర్యాప్తును జరగనివ్వండి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభాకర్ రావుకు భారత్కు మాత్రమే ప్రయాణించడానికి పాస్పోర్ ్ట లేదా ప్రయాణ అనుమతి పత్రాన్ని అందించండి. ఆ పత్రం అందిన మూడ్రోజుల్లో తిరిగి వచ్చి దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరవుతానంటూ ఆయన కోర్టుకు అఫిడవిట్ అందజేయాలి’ అని వ్యాఖ్యానించారు.
ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ జరిగింది?
ప్రభాకర్రావుకు ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్న సిట్
ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ తుది అంకానికి చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్రావును విచారణకు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణకు ప్రభాకర్రావు హాజరైతే ఆయనకు సంధించే ప్రశ్నలపైనా దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తి శ్రవణ్రావు మధ్య మధ్య లింక్ ఏ విధంగా కుదిరింది? ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ నిబంధనలను పాటించారా? హార్డ్డి్స్కలను ఎందుకు ధ్వంసం చేశారు? అనే అంశాలకు సంబంధించి ఇప్పటిదాకా అరెస్టైన వారి వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్రావును ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఆయన దర్యాప్తు అధికారుల ముందు హజరవుతారా? లేక మరేదైనా మెలిక పెడతారా? అనే సందేహలు దర్యాప్తు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News