Share News

Sridhar Babu: అప్పుడు ఈడీ అపవిత్రం.. ఇప్పుడు పవిత్రమా?

ABN , Publish Date - May 25 , 2025 | 03:45 AM

అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. ప్రతిపక్షంలోకి రాగానే పవిత్రంగా కనిపిస్తుందా? అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించారు.

Sridhar Babu: అప్పుడు ఈడీ అపవిత్రం.. ఇప్పుడు పవిత్రమా?

  • బీఆర్‌ఎ్‌సది నియంతృత్వ పాలన: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. ప్రతిపక్షంలోకి రాగానే పవిత్రంగా కనిపిస్తుందా? అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించారు. ఇప్పుడు పొగుడుతున్న దర్యాప్తు సంస్థయే గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసిన సంగతిని మర్చిపోయారా..? అంటూ శనివారం ఒక ప్రకటనలో నిలదీశారు.


60 ఏళ్ల కలను సాకారం చేస్తూ సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. బీఆర్‌ఎస్‌ పదేళ్లు తెలంగాణను దెయ్యంలా పట్టి పీడించిందని విమర్శించారు. నియంతృత్వ పాలనతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులకు కాంగ్రె్‌సను విమర్శించే హక్కు లేదన్నారు. ఈడీని పావుగా చేసుకొని కాంగ్రెస్‌ అగ్ర నాయకులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిస్తున్న అక్రమ కేసులను బీఆర్‌ఎస్‌ సమర్థించడం వెనుకున్న చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - May 25 , 2025 | 03:45 AM