Sridhar Babu: న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - May 03 , 2025 | 05:15 AM
న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. న్యాయవాదుల భద్రత కోసం ఇటీవలే ‘ప్రొటెక్షన్ యాక్ట్’ను చట్టం చేశామని.. త్వరలోనే దాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు.

సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, మే 2(ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. న్యాయవాదుల భద్రత కోసం ఇటీవలే ‘ప్రొటెక్షన్ యాక్ట్’ను చట్టం చేశామని.. త్వరలోనే దాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన అడ్వొకేట్స్ సొసైటీ రజతోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం కోసం మరో రూ.100కోట్లు కేటాయించే విషయమై సీఎంను కోరనున్నట్లు తెలిపారు. అనారోగ్యం పాలైన, చనిపోయిన లాయర్ల కుటుంబాలకు న్యాయవాదుల సొసైటీ అండగా నిలుస్తుండటాన్ని ప్రశంసించారు.
తాను కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని లేకపోతే హైకోర్టులో అడ్వొకేట్గా ప్రాక్టీసు చేస్తుండేవాడినన్నారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, జి.మధుసూదన్రెడ్డితో కలిసి న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్యేలతో కలిసి సొసైటీ సిల్వర్ జూబ్లీ సావనీర్ను ఆవిష్కరించారు.