Sridhar Babu: పుష్కరఘాట్ పనుల్లో నాణ్యత పాటించండి
ABN , Publish Date - May 12 , 2025 | 04:43 AM
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ పనుల్లో రాజీ పడొద్దని.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూవేగంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
మహదేవపూర్, మే 11 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ పనుల్లో రాజీ పడొద్దని.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూవేగంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. సరస్వతి నది పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్తో కలిసి మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పనులను పరిశీలించారు. పనులు మందకొడిగా సాగుతుండటంపై అధికారులను మందలించారు. అనంతరం వీఐపీ ఘాట్ వద్ద అధికారులతో సమావేశం నిర్వహించారు. అవసరమైన శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News