Sri Chaitanya: శీచైతన్య అగ్రస్థానం
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:20 AM
నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు టాప్ ర్యాంకులు సాధించడంలో శ్రీచైతన్య విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయని ఆ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు.

హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు టాప్ ర్యాంకులు సాధించడంలో శ్రీచైతన్య విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయని ఆ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. శనివారం ఆమె డైరెక్టర్ సీమతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలిండియా మొదటి ర్యాంక్ కవిష్ సాధించగా.. దివ్య (5వ ర్యాంకు), మహ్మద్ సమీర్ (6వ, ఓబీసీ), ధీరజ్కుమార్ (8వ, ఎస్టీ), ఎం.వరుణ్ (10వ, ఓబీసీ) ర్యాంకులు సాధించింది శ్రీచైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థులేనని ఆమె పేర్కొన్నారు.
నాణ్యమైన శిక్షణ అందించడం వల్లనే మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఓపెన్ క్యాటగిరిలో 100లోపు అత్యధిక ర్యాంకులు సాధించింది కూడా తమ విద్యాసంస్థలకు చెందినవారేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఆమె అభినందించారు. జేఈఈ ఫలితాల్లో సాధించిన విజయాలు నీట్లోనూ పునరావృతం అయ్యాయని ఆమె పేర్కొన్నారు.