Nagarjuna Sagar: జవహర్ ఎత్తిపోతల టెండర్లకు సీవోటీ ఆమోదం
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:35 AM
నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో నిర్మించతలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం

4.85% అదనంగా టెండర్ వేసిన పీవీఆర్ ప్రాజెక్ట్స్
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో నిర్మించతలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) ఆమోదం తెలిపింది. ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన సీవోటీ సమావేశంలో ఈ ఎత్తిపోతల టెండర్లపై చర్చించి ఆమోదం తెలిపారు.
రూ.456.49 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో టెండర్లు పిలువగా... 4.85శాతం హెచ్చింపుతో పీవీఆర్ ప్రాజెక్ట్స్ (80 శాతం) - ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ(20 శాతం) జాయింట్ వెంచర్ టెండర్ వేసింది. ఈ సంస్థకు టెండర్ కట్టబెట్టడానికి సీవోటీ ఆమోదం తెలపడంతో సంబంధిత ప్రాజెక్టు ఎస్ఈ వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు.