Share News

Shanti Kumari: ఎంసీహెచ్చార్డీ వైస్‌ చైర్మన్‌గా శాంతికుమారి

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:26 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రైటర్‌ అవుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) వైస్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

Shanti Kumari: ఎంసీహెచ్చార్డీ వైస్‌ చైర్మన్‌గా శాంతికుమారి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రైటర్‌ అవుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) వైస్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసీహెచ్చార్డీ వైస్‌ చైర్మన్‌తోపాటు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు.


శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేశాక ఈ బాధ్యతలను చేపడతారు. ఇప్పటివరకు ఎంసీహెచ్చార్డీ డీజీగా ఉన్న శశాంక్‌ గోయల్‌ సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) వైస్‌ చైర్మన్‌గా బదిలీ అయిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను శాంతికుమారికి అప్పగించారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 04:26 AM