ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ABN , Publish Date - May 15 , 2025 | 04:54 AM
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. నగరంలోని ఎర్రగడ్డలో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ సభ్యుడిగా వ్యవరిస్తున్నారు.

బంజారాహిల్స్, మే 14 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. నగరంలోని ఎర్రగడ్డలో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ సభ్యుడిగా వ్యవరిస్తున్నారు. ఈ నెల 14న బంజారాహిల్స్లో మీడియాతో సమావేశంలో పాడి కౌశిక్రెడ్డి టీజీఎస్ గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, ఇందులో రాములు నాయక్ అతని కోడలు కడావత్ రోజాబాయి ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు.
కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ రాములు నాయక్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News