బాలికల విద్యాసంస్థల్లో మహిళా సిబ్బందే ఉండాలి
ABN , Publish Date - May 06 , 2025 | 05:32 AM
బాలికల గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిగా మహిళలు మాత్రమే పనిచేయాలనే ప్రభుత్వ నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది.

జీవో నెం.1274 పటిష్ఠంగా అమలు చేయాలి
ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం
బాలికల గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిగా మహిళలు మాత్రమే పనిచేయాలనే ప్రభుత్వ నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. బాలికల పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న 57 మంది పురుష సిబ్బందిని బాలుర పాఠశాలలకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాలికల గురుకుల పాఠశాలల్లో మహిళలు మాత్రమే పనిచేయాలని 2016లో అప్పటి ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.1274 ను విడుదల చేసింది. దీనిని అమలు చేయడంలో సంబంధిత సొసైటీ అధికారులు నిర్లక్ష్యం వహించారు.
రాష్ట్రంలో చాలా చోట్ల బాలికల పాఠశాలల్లో పురుషులు పనిచేస్తున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కొందరిపై ఇటీవల ఏడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో జీవో నెం. 1274ను పటిష్ఠంగా అమలు చేయాలని సొసైటీ అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 268 ఎస్సీ గురుకుల విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 57 మంది పురుష సిబ్బందిని బాలుర పాఠశాలలకు బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పొరుగు సేవలు, పార్ట్టైం సిబ్బందిని కూడా మహిళలతోనే భర్తీ చేస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News