ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు: సజ్జనార్
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:33 AM
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులకు నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసిందని ఎండీ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులకు నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసిందని ఎండీ సజ్జనార్ తెలిపారు. కల్యాణ తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతోపాటు సంస్థ వెబ్సైట్లో రూ. 151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని అన్నారు. ఆర్టీసీ వెబ్సైట్ ్టజటట్టఛిజూౌజజీట్టజీఛిట.ఛిౌ.జీుఽలో ఆన్లైన్ బుకింగ్తోపాటు కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040- 69440000 ను సంప్రదిస్తే.. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్లు భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారన్నారని సజ్జనార్ తెలిపారు.