Rice: 30 వరకే రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తాం..
ABN , Publish Date - Jun 14 , 2025 | 10:52 AM
రేషన్ షాపుల్లో సన్నబయ్యం పంపిణీ ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి వనజాతారెడ్డి స్పష్టం చేశారు.

- డీసీఎ్సవో వనజాతారెడ్డి వెల్లడి
- వదంతులు నమ్మొద్దని సూచన
హైదరాబాద్: రేషన్ షాపుల్లో సన్నబయ్యం పంపిణీ ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి వనజాతారెడ్డి(Vanajata Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం బాలాపూర్లోని రేషన్షాపును సందర్శించిన ఆమె మాట్లాడుతూ ఈ సారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నందున తమకు బియ్యం దొరుకుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని, ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ నెలాఖరు వరకు షాపుల్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఈనెల 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపి ణీ ఉంటుందంటూ జరుగుతున్న పుకార్లు నమ్మవద్దని, ఈ నెలంతా బియ్యం పంపిణీ కచ్చితంగా జరుగుతుందని వనజాతారెడ్డి తెలిపారు. వదంతులు నమ్మి ఒకేసారి షాపుల వద్దకు గుంపులుగా రావాల్సిన అవసరం లేదని, నెలాఖరు దాకా ఎప్పుడైనా సరకులు తీసుకోవచ్చని ఆమె చెప్పారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం బాలాపూర్ మండ ల అధ్యక్షుడు టేకుల శశిధర్రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News