Civil Services 62 Rank: రైల్వే ట్రైన్ మేనేజర్ (గార్డు) కుమారుడికి సివిల్స్లో 62వ ర్యాంకు
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:08 AM
శ్రావణ్ కుమార్రెడ్డి సివిల్స్లో 62వ ర్యాంకు సాధించి కుటుంబానికే గౌరవాన్ని తెచ్చుకున్నారు. ఐఐటీ ముంబైలో చదివిన శ్రావణ్ ఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్నారు

చిలకలగూడ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): సివిల్స్ ఫలితాల్లో రైల్వే ట్రైన్ మేనేజర్ (గార్డు) శివశంకర్రెడ్డి కుమారుడు శ్రావణ్ కుమార్రెడ్డి 62వర్యాంకు సాధించాడు. శివశంకర్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్)లో ట్రైన్ మేనేజర్. శ్రావణ్ తల్లి గృహిణి. సోదరి ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నారు. శ్రావణ్కుమార్రెడ్డి బోడుప్పల్లో చదువుకున్నారు.ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఐఆర్ఎంఎస్ శిక్షణ తీసుకుంటున్నారు. ఆరోసారి సివిల్స్ పరీక్ష రాసి శ్రావణ్ 62వ ర్యాంకు సాధించినట్టు శివశంకర్ రెడ్డి తెలిపారు.