Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 07:01 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటి-1 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్కుమార్ తెలిపారు.

- నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటి-1(Azamabad Division, Hyderabad City-1) పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్కుమార్ తెలిపారు. టూరిస్ట్ హోటల్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, భోలక్పూర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెడ్రోజ్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
రేణుకా ఎన్క్లేవ్ పరిధిలో మధ్యాహ్నం 2నుంచి 3 గంటల వరకు, విద్యానగర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు, బాలాజినగర్ పరిధిలో సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు, బర్కత్పుర పరిధిలో సాయంత్రం 4.30 నుంచి 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మరికొన్ని ఏరియాల్లో కూడా..
గోకుల్నగర్, మజీద్ ఫీడర్ల పరిధిలో సాంకేతిక మర్మతుల కారణంగా పలు కాలనీలలో శనివారం విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఎ్సరావునగర్ ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. రాధికా చౌరస్తా నుంచి గుడ్లక్ కేఫ్, ఎల్ఐజి-బి, ఎంఐజి-బి, సి కాలనీలలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, శ్రామిక్నగర్, మారుతీనగర్లలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో కోత ఉంటుందని వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆమె కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News