Ponnam Prabhakar: మెస్సేజ్ పెట్టు.. అపాయింట్మెంట్ పట్టు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:31 AM
సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తనను కలిసేందుకు వచ్చే వారి కోసం ఓ వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ఆలోచన
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తనను కలిసేందుకు వచ్చే వారి కోసం ఓ వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు సచివాలయంలోని తన చాంబర్ ఎదుట ‘‘మంత్రి అపాయింట్మెంట్ కోసం 9959226407 నంబర్కు వాట్సా్పలో మెసేజ్ చేయండి’’ అంటూ ఒక బోర్డు ఏర్పాటు చేయించారు.
ఈ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇలా మెసేజ్లు చేసిన వారితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక రోజును మంత్రి కేటాయిస్తున్నారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు.. విషయం ఏంటంటే..
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..