Share News

Nizamabad News: పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:49 PM

Nizamabad News: పుట్టే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ తండ్రి. బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూశాడు. కానీ చివరకు పుట్టిన బిడ్డ గురించి వైద్యులు చెప్పింది తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

Nizamabad News: పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Nizamabad News

నిజామాబాద్, జూన్ 13: జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓ యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. సాయిలు అనే యువకుడు ఆస్పత్రి ఆవరణలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే సాయిలు బలవన్మరణానికి గల కారణాలు తెలిసి అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంతకీ సాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం.


జిల్లాలోని జుక్కల్ మండలం మాహమ్మదా బాద్ గ్రామానికి చెందిన పానుగంటి సాయిలుకు కొద్ది నెలల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ హ్యాపీ జీవనం సాగిస్తున్నారు. ఇదే సమయంలో అతడి భార్య గర్భిణి అని తెలిసి ఎంతో మురిసిపోయాడు. భార్యను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. పుట్టే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నారు దంపతులు. ఇక బిడ్డకు జన్మనిచ్చే సమయం వచ్చేసింది. భార్యకు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు సాయిలు. మరికొద్ది గంటల్లో తమకు బాబో, పాపో పుట్టబోతున్నారని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. డెలివరీ తర్వాత వైద్యులు చెప్పిన విషయంతో సాయిలు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.


డెలివరీకి వచ్చిన సాయిలు భార్యకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో కుటుంబసభ్యులతో పాటు సాయిల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ బాబు పుట్టిన వెంటనే అనారోగ్య సమస్యతో మరణించాడు. ఈ విషయాన్ని సాయిలుకు చెప్పారు ఆస్పత్రి సిబ్బంది. పుట్టిన బిడ్డను చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న యువకుడికి కుమారుడి మరణవార్త విని చలించిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన సదరు యువకుడు ఆస్పత్రి ఆవరణలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన భార్య తీవ్రంగా విలపించింది. ఓ వైపు అప్పుడే పుట్టిన బిడ్డ, మరోవైపు కట్టుకున్న భర్త ఇలా బలవన్మరణం చెందడంతో ఆ భార్య బాధ వర్ణణాతీతం. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిలు మృతితో మహహ్మదాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి

తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు

విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:02 PM