Nizamabad : నిజామాబాద్ జిల్లాలో రూ. 25 లక్షల విలువైన అల్ర్పాజోలం పట్టివేత
ABN , Publish Date - May 17 , 2025 | 04:28 AM
అల్ర్పాజోలం ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్ర నుంచి కారులో అల్ర్పాజోలం తెలంగాణలోకి వస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఐదుగురి అరెస్టు.. పరారీలో మరొకరు..
బోధన్ రూరల్, మే 16 (ఆంధ్రజ్యోతి): అల్ర్పాజోలం ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్ర నుంచి కారులో అల్ర్పాజోలం తెలంగాణలోకి వస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా కారులో రూ.25లక్షల విలువైన రెండున్నర కిలోల అల్ర్పాజోలం స్వాధీనం చేసుకోవడంతోపాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసు స్టేషన్లో ఈ వివరాలను పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మహారాష్ట్రలోని సాతరా జిల్లా కేంద్రానికి చెందిన విశ్వనాథ్ శివాంకర్.. అదే పట్టణంలో సూర్యప్రభ అనే పేరుతో ఫార్మా కెమికల్ కంపెనీ నడుపుతున్నాడు. శివాంకర్కు సాతరాకు చెందిన అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబు రావు బస్వరాజ్ కాడేరి, షబ్బీర్ అలీ పాషామియా చౌదరి, పరమేశ్వర్ విజయ్తో పాటు నిజామాబాద్ జిల్లా సాలూరకు చెందిన మల్లెపూల లక్ష్మణ్ గౌడ్లు స్నేహితులు. శివాంకర్ గత రెండేళ్లుగా ఫార్మా కంపెనీ పేరిట ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తుండేవాడు.
సరిగ్గా ఇదే కోవలో అల్ర్పాజోలం తయారు చేసి వివిధ ప్రాంతాలకు విక్రయించేవాడు. తన దందాను తెలంగాణలోనూ విస్తరించాలని అమర్ సింగ్, బాబు రావు, షబ్బీర్ అలీ, విజయ్, లక్ష్మణ్ గౌడ్తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆ తర్వాత తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వీరితో కలిసి అల్ర్పాజోలం విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్ర్పాజోలాన్ని తరలిస్తుండగా బోధన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వనాథ్ శివాంకర్ పరారీలో ఉన్నట్టు సీపీ తెలిపారు. ఎవరైనా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News