Share News

ఆటో డ్రైవర్‌ మృతిపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

ABN , Publish Date - Jun 06 , 2025 | 02:49 AM

పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు (ఎన్‌హెచ్‌ఆర్సీ) జారీ చేసింది.

ఆటో డ్రైవర్‌ మృతిపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

  • సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశం

  • పోలీసు కస్టడీలో లాఠీ దెబ్బల వల్లే ఆటో డ్రైవర్‌ మరణించినట్లు ఆరోపణలు

  • రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఘటన

  • కేసుపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా విచారణ

న్యూఢిల్లీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు (ఎన్‌హెచ్‌ఆర్సీ) జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్రమైన నివేదిక అందజేయాలని గురువారం ఆదేశించింది. ఆటో డైవ్రర్‌ మరణించిన అంశాన్ని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. మీడియా కథనాల ప్రకారం... హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆటో డైవ్రర్‌(35), అతని భార్యకు మధ్య కొన్ని మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో 2025 మే 13న ఆటో డైవ్రర్‌ను అతని భార్య రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లింది.


దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆటో డైవ్రర్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు అతడిని రబ్బరు బెల్టుతో తీవ్రంగా కొట్టారు. గంట తర్వాత అతడిని వదిలి పెట్టగా స్టేషన్‌ బయటికి రాగానే వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కథనాలను పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ విషయాన్ని డీజీపీకి జారీ చేసిన నోటీసుల్లోనూ స్పష్టం చేసింది. మీడియాలో కథనాలు నిజమైతే ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 02:49 AM