NEET Results: నేడు నీట్ ఫలితాలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:22 AM
దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో పరీక్షకు హాజరైన 72,507 మంది విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న నీట్ (యూజీ) ఫలితాలు విడుదల కావలసి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, 72,507 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఆ సంఖ్య 77,849గా ఉంది. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి 29 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి.
వాటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 400 వరకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి. వాటితో పాటు ఈఎ్సఐ సనత్నగర్ వైద్య కళాశాల, బీబీనగర్ ఏయిమ్స్లో కూడా సీట్లున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్షకు 20.8 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది ఆ సంఖ్య 23.33 లక్షలుగా ఉంది. ఈ ఏడాది దరఖాస్తు చేసిన వారిలో 91.4 శాతం మంది పరీక్ష రాసినట్లు కేంద్రం వెల్లడించింది.
నీట్(NEET) ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
అభ్యర్థులు ముందుగా నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించండి.
ఆ తరువాత స్కోర్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేయండి.
ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి.
మీ స్కోర్ కార్డ్ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది.
భవిష్యత్ అవసరాల కోసం నీట్ స్కోర్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.