Share News

Chamala Kiran: తప్పు చేయకుంటే మొహం చాటేయడమెందుకు?

ABN , Publish Date - May 23 , 2025 | 04:18 AM

కాళేశ్వరంలో అవినీతి జరగనప్పుడు కమిషన్‌ విచారణ అనగానే ఎందుకు భయపడుతున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పేమీ చేయకుంటే కేసీఆర్‌ ముఖమెందుకు చాటేస్తున్నారని నిలదీశారు.

Chamala Kiran: తప్పు చేయకుంటే మొహం చాటేయడమెందుకు?

  • కేటీఆర్‌ ఆరోపణలు మానసిక అంధత్వానికి నిదర్శనం

  • కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంలో అవినీతి జరగనప్పుడు కమిషన్‌ విచారణ అనగానే ఎందుకు భయపడుతున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పేమీ చేయకుంటే కేసీఆర్‌ ముఖమెందుకు చాటేస్తున్నారని నిలదీశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో చామల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో ఏమీ జరగకుంటే నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నోటీసులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ప్రాజెక్టు నుంచి సుమారు పది కిలోమీటర్ల వరకు నిషిద్ధ ప్రాంతంగా ఉంచారని, రాహుల్‌ గాంధీకి సైతం ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలియాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు పాలమూరు-రంగారెడ్డిపై కేసు వేసిన నాగం జనార్దన్‌ రెడ్డిని అడగాలని సూచించారు.


కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాంగ్రెస్‌ వాళ్లు బాంబులు పెట్టారని కేటీఆర్‌ ఆరోపించడం ఆయన మానసిక అంధత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన, కుటుంబ పరిస్థితి గురించి కవిత అమెరికా వెళ్లేటప్పుడే చెప్పిందన్నారు. ఇంటి సమస్యలు బయటికొస్తాయేమోనన్న భయంతోనే హరీశ్‌ రావు ఇంటికి కేటీఆర్‌ వెళ్లారని ఆరోపించారు. కాగా, యాదాద్రి-భువనగిరి జిల్లా కొలనుపాకలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి ప్రసాద్‌ పథకం 2.0 కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:18 AM